గుట్టల్లో వ్యక్తి మృతి.. అసలేం జరిగింది ?

by  |
గుట్టల్లో వ్యక్తి మృతి..  అసలేం జరిగింది ?
X

దిశ, పరకాల: హన్మకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శాయంపేట మండలం గోవిందాపూర్ వద్దగల ఈ ఆర్ ఆర్ క్రషర్ వద్ద బోర్ బ్లాస్టింగ్ కోసం కంప్రెసర్ ద్వారా గుట్టపై డ్రిల్లింగ్ వేయడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు అదే కంప్రెసర్ బండి కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శాయంపేట మండలం తహరాపూర్ గ్రామానికి చెందిన ఓర్సు మల్లేష్ (30) ఈరోజు ఉదయం ఈ ఆర్ ఆర్ కంప్రెసర్ యజమాన్యం నిర్ణయం మేరకు గుట్టపై బండరాళ్లను ధ్వంసం చేసే నిమిత్తం కంప్రెషర్ సహాయంతో డ్రిల్లింగ్ వేయడానికి వెళ్ళాడు. గుట్ట పైకి వెళ్లి డ్రిల్లింగ్ చేసి తిరిగి వస్తున్న క్రమంలో కంప్రెసర్ బండి అదుపుతప్పి పల్టీ కొట్టడం జరిగింది. దీంతో మల్లేష్ కంప్రెసర్ బండి కింద పడిపోగా తోటి వర్కర్స్ గమనించి మల్లేష్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందినట్టు సమాచారం. మల్లేష్ మృతి గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed