అలియా సినిమాపై కేసు నమోదు

by  |
అలియా సినిమాపై కేసు నమోదు
X

‘సడక్ 2’ సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌లో రిలీజ్ అవుతుందని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి మహేశ్ భట్ డైరెక్టర్ కాగా ముఖేశ్ భట్ నిర్మాత. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి నెపోటిజం కారణమంటూ అలియా, మహేశ్ భట్‌లపై మండిపడుతున్నారు అభిమానులు. సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. కానీ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తామని ప్రకటించింది మూవీ యూనిట్.

ఇదిలా ఉంటే, ఇటీవల విడుదలైన ‘సడక్ 2’ పోస్టర్.. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ సోనూ కుమార్ అనే న్యాయవాది కేసు నమోదు చేశారు. 120బీ, 295ఏ సెక్షన్ల కింద అలియా, మహేశ్, ముఖేశ్‌లపై కేసు ఫైల్ అయింది. ఈ చిత్రంలో సంజయ్‌దత్, ఆదిత్య కపూర్, పూజ భట్ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. 1991లో సూపర్ హిట్ అయిన ‘సడక్’ సినిమాకు ఇది సీక్వెల్.



Next Story

Most Viewed