వనస్థలిపురంలో పట్టపగలే భారీ చోరీ.. 40 తులాల బంగారంతో పాటు..!

by  |
వనస్థలిపురంలో పట్టపగలే భారీ చోరీ.. 40 తులాల బంగారంతో పాటు..!
X

దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లాలో భారీ దొంగతనం జరిగింది. పట్టపగలే ఇంటి తాళాలు బద్దలు గొట్టిన దొంగలు ఏకంగా 40 తులాల బంగారం, 5 కేజీల వెండి, రూ.35 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురంలో ఆదివారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు పని మీద ఊరికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్టు తెలుస్తోంది.

చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారం మేరకు యాజమానులు వచ్చి చూసుకోగా ఇంట్లోని గోల్డ్ అండ్ నగదు పోయిన విషయం తెలుసుకుని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్టు పోలీసులు తెలుపారు. కాగా, ఈ ఘనటకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed