సుచిత్రలో పోలీస్ చెక్‌పోస్ట్‌కు ఇల్లు కట్టించారు…

by  |
సుచిత్రలో పోలీస్ చెక్‌పోస్ట్‌కు ఇల్లు కట్టించారు…
X

దిశ, కుత్బుల్లాపూర్ : ఎప్పుడైనా నగరంలోని పలు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్ లు పెట్టడం పరిపాటే. అయితే టెంట్ వేయడం, చిన్న క్యాబిన్లు కట్టించడం మాత్రమే మనకు తెలుసు. కానీ లాక్ డౌన్ సందర్భంగా పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుచిత్ర చౌరస్తాలో ఏకంగా ఇల్లునే కట్టించారు. అదేంటి పర్మనెంట్ ఇళ్లు కట్టించడం ఏందని అనుకుంటున్నారా…? అయితే ఆగండి పూర్తి వివరాలు చెబుతాను.

ఇటీవల నగర శివారులోని వ్యవసాయ క్షేత్రాలు, సంపన్నులు అయితే మొబైల్ ఇళ్లను ఏర్పాటు చేసుకుంటారు. అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి లో మొబైల్ ఇండ్ల తయారీ పరిశ్రమ ఉంది. ఆ నిర్వహకుడు పోలీసుల కష్టాలను చూసి టెంట్ వేస్తే గాలికి కులుతుందని, పోలీసులు గాయాలకు గురై అవకాశముందని గ్రహించాడు. పరిశ్రమలోని ఓ మొబైల్ ఇల్లును చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసి పోలీసులు ఇబ్బందులకు గురి కాకుండా ఈ ఇల్లును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed