ఇంట్లో నుండి బాలికను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్

by  |
ఇంట్లో నుండి బాలికను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలపై అత్యాచారాలు శరమాములు అయిపోయాయి. రోజురోజుకు ఇంటా, బయట రక్షణ లేకుండా పోతోంది. వారికి సురక్షిత ప్రాంతాలే కరువవుతున్నాయి. ఇంట్లో నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడింది ఓ దొంగల ముఠా. ఉత్తరప్రదేశ్‌లోని సహారాన్‌పూర్ జిల్లాలో జరిగిన మరో ఘోర ఘటనతో ఆ జిల్లా ఉలిక్కిపడింది. అయితే ఈ ఘటనను పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సహారాన్‌పూర్ జిల్లా నానౌట ప్రాంతంలోని ఓ ఇంటిపై బుధవారం రాత్రి నలుగురు దొంగలు ఇంట్లోకి చొరబడి రూ .4.67 లక్షలు దోచుకున్నారు. దోపిడీ తరువాత, నలుగురు నిందితులు ఆ ఇంట్లోని బాలికను కిడ్నాప్ చేసి చెరకు క్షేత్రానికి తీసుకెళ్లారు, అక్కడ నలుగురు దొంగలు బాధితురాలిపై అత్యాచారం చేశారు. గురువారం ఉదయం స్పృహలోకి వచ్చిన బాలిక.. తిరిగి ఇంటికి వచ్చింది. జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నిందితుల్లో ఇద్దరు అదే గ్రామానికి చెందిన యువకులుగా బాలిక గుర్తు పట్టింది. వారిద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అయితే పోలీసులు సామూహిక అత్యాచారం ఆరోపణను ఖండించారు. దీనిని కేవలం దోపిడీ కేసుగా పేర్కొన్నారు. మరోవైపు ఎస్పీ (గ్రామీణ) అతుల్ శర్మ స్పందించారు. “బాలిక తండ్రి నుండి మాకు ఫిర్యాదు అందింది. అత్యాచారం, దొంగతనం సెక్షన్ల కింద కేసు నమోదైంది. మేము కేసును పరిశీలిస్తున్నాం. తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, నలుగురు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి, ఇంటి యజమానిని బందీగా తీసుకొని రూ .4.67 లక్షలు, ఇతర బంగారు ఆభరణాలను దోచుకున్నారు. తరువాత, వారు బాలికను కిడ్నాప్ చేసి, సమీపంలోని చెరకు క్షేత్రానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు అని పేర్కొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed