యువతిపై సామూహిక అత్యాచారం

by  |
యువతిపై సామూహిక అత్యాచారం
X

దిశ, రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొంతమంది దుర్మార్గులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన షాద్ నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. కొందుర్గ్ కు చెందిన ఓ యువతిని ఈనెల 24వ తేదీన ఓ యువకుడు ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. అనంతరం ఆ యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆ యువకుడు, అతడి స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ యువతి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో ఆ యువతిపై ఆ దుండుగులు దాడి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Next Story

Most Viewed