- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఇద్దరి మధ్య జరిగిన చిన్న వివాదం ఒకరి ప్రాణాలను తీసింది. ఇద్దరు స్నేహితులు మద్యం మత్తులో ఘర్షణకు దిగి ఒకరు హతమయ్యారు. ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్లోని మణికొండ ప్రాంతానికి చెందిన షకీబ్, గౌసుద్దీన్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. స్నేహితులైన వీరిద్దరు బంజారహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో పూర్తిగా మద్యం మత్తులో ఉన్న గౌసుద్దీన్ క్షణికావేశంలో షకీబ్ను హతమర్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోని కేసు నమోదు చేశారు.
Next Story