స్నేహితుడి ప్రాణం తీసిన ఘర్షణ

by  |
స్నేహితుడి ప్రాణం తీసిన ఘర్షణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరి మధ్య జరిగిన చిన్న వివాదం ఒకరి ప్రాణాలను తీసింది. ఇద్దరు స్నేహితులు మద్యం మత్తులో ఘర్షణకు దిగి ఒకరు హతమయ్యారు. ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతానికి చెందిన షకీబ్, గౌసుద్దీన్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. స్నేహితులైన వీరిద్దరు బంజారహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో పూర్తిగా మద్యం మత్తులో ఉన్న గౌసుద్దీన్ క్షణికావేశంలో షకీబ్‌ను హతమర్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోని కేసు నమోదు చేశారు.



Next Story

Most Viewed