- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానీ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో ఓ రైతు మరణించాడు. సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో అదే ట్రాక్టర్ కింద పడి రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో రైతులు ఆగ్రహానికి గురైన రైతులు మరణించిన సదరు రైతుపై జాతీయ జెండా కప్పి ఐటీఓ ఇంటర్ సెక్షన్ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల కాల్పలు వల్లే రైతు మరణించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్టర్ను మలుపు తీసుకునే సమయంలో పోలీసులు కాల్పులు జరిపారని, ఆ ప్రమాదంలో రైతు మరణించాడని వెల్లడించారు. ఈ క్రమంలో మరికొందరు రైతులు ట్రాక్టర్ ర్యాలీతో ఎర్రకోటకు చేరుకొని, ఎర్రకోటపై కిసాన్ జెండా ఎగరేశారు.