బెల్లంపల్లి: గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగుపాము

by  |
cobra, temple
X

దిశ, తాండూర్: బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర ఆలయంలో మంగళవారం సాయంత్రం నాగుపాము ప్రత్యక్షమైంది. గర్భగుడిలోని శివలింగం చుట్టూ సమీపంలో తిరుగుతున్న సర్పాన్ని భక్తులు గుర్తించారు. ఆలయంలోని గర్భగుడిలో నాగుపాము ప్రత్యక్షం కావడం వాస్తవమేనని ఆలయ చైర్మన్ మాసాడి శ్రీదేవి తెలిపారు. కాగా, తాండూర్ మండలంలోని కాసిపేట, ద్వారకాపూర్ గ్రామాలకు చెందిన భక్తులు రాజరాజేశ్వరి దేవాలయం దర్శనానికి వచ్చి మొక్కలు చెల్లిస్తుండగా నాగుపాము వారికి కనిపించిందని తెలిపారు.



Next Story

Most Viewed