నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన ముగ్గురిపై కేసు నమోదు

by  |

దిశ, ఆదిలాబాద్: ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్‌లో జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమానికి వెళ్లి వచ్చి.. విషయాన్ని గోప్యంగా ఉంచిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు నిర్మల్ పట్టణ సీఐ జాన్ దివాకర్ తెలిపారు. నిర్మల్ పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల నిజామొద్దీన్‌కు వెళ్లారని.. తిరిగి వచ్చినా కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. అంటువ్యాధులు కూడా ప్రభలేందుకు వీరు కారకులయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు జాన్ దివాకర్ వెల్లడించారు.

Tags: CI John Divakar, comments, case against, 3 people, nirmal



Next Story

Most Viewed