ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదు

by  |
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. సోమవారం ప్రభుత్వం నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంగాన్ని కోమటిరెడ్డి అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ గిరిధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.



Next Story