రోడ్డు దాటుతుండగా మహిళలపైకి దూసుకొచ్చిన బైకు..

by  |
roadaccident
X

దిశ, వెబ్‌డెస్క్ : నగరంలోని అబ్దుల్లాపూర్ మెట్‌ పరిధిలో గల బాట సింగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలపైకి ద్విచక్ర వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఒకరికి తీవ్రగాయాలవ్వగా, మరో మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే, తీవ్రగాయాలపాలైన విజయశాంతి అనే మహిళ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది.

అర్చన అనే మహిళ ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి తప్పించుకుని చికిత్స పొందుతోంది. ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైన బైకర్ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


Next Story