- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రైతులకు గుడ్ న్యూస్.. ఈసారి ముందే రానున్న నైరూతి ఋతుపవనాలు

దిశ, వెబ్ డెస్క్: రైతులకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ఈ ఏడాది ఋతుపవనాలు (Monsoon) నిర్ణీత సమయం కంటే ముందే రానున్నట్లు తెలిపింది. ఈ నెల 27వ తేదీన నైరూతీ ఋతుపవనాలు కేరళను తాకనున్నట్లు IMD పేర్కొంది. అలాగే, రానున్న రెండు రోజుల్లో ఏపీలో అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని చెప్పింది. అంతేకాదు, ఈ ఏడాది ఋతుపవనాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.
ఇక అంచనా వేసినట్లు ముందుగానే ఋతుపవనాలు కేరళను చేరితే, 2009 తర్వాత తొలిసారి వర్షాకాలం ముందుగా వస్తున్నట్లు ఐఎండీ వెల్లడించింది. 2009 సంవత్సరంలో మే 23వ తేదీన నైరుతీ కేరళను తాకినట్లు ఐఎండీ డేటా ప్రకారం తెలుస్తుంది. సాధారణంగా జూన్ 1వ తేదీ వరకు కేరళలోకి నైరుతీ ఋతుపవనాలు ప్రవేశించి, జూలై 8వ తేదీలోగా దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. ఇక సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఆగ్నేయ దిశ నుంచి తిరోగమనం అవుతాయి. అక్టోబర్ 15వ తేదీలోగా పూర్తి ఆ ఋతుపవనాలు వెళ్లిపోతాయి.