భారత్ - పాక్ మధ్య చేదాటిన పరిస్థితి.. రంగంలోకి అమెరికా

by Gantepaka Srikanth |

భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న నేపథ్యంలో అగ్రదేశం అమెరికా రంగంలోకి దిగింది.

భారత్ - పాక్ మధ్య చేదాటిన పరిస్థితి.. రంగంలోకి అమెరికా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న నేపథ్యంలో అగ్రదేశం అమెరికా రంగంలోకి దిగింది. పాకిస్తాన్‌ ప్రధానికి అమెరికా(america) సెక్రటరీ మార్కో రుబియో ఫోన్ చేశారు. తక్షణమే యుద్ధం ఆపేయాలని సూచించారు. ఇరు దేశాల మధ్య చర్చలకు మద్దతిస్తామని హామీ ఇచ్చారు. అమెరికా స్పందనపై పాక్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పాక్ వరుస దాడుల నేపథ్యంలో భారత్ కౌంటర్ అటాక్‌కు దిగింది. పాకిస్తాన్‌లోని లాహోర్, సియోల్‌కోట్‌పై ప్రతిదాడికి పాల్పడింది. కాగా, గురువారం సాయంత్రం ఇండియాలోని జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లపై పాక్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.

Next Story