- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భారత్-పాక్ కాల్పుల విరమణపై స్పందించిన ఐరాస.. అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్న కాంగ్రెస్

దిశ, వెబ్డెస్క్: అమెరికా దౌత్యంతో భారత్ - పాకిస్థాన్ దేశాలు కాల్పుల విమరణకు (India-Pakistan Cease Fire) అంగీకరించడంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇరుదేశాలు తీసుకున్న నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి (United Nations) స్పందించింది. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరుదేశాలు ముందుకు రావడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ (António Guterres) స్వాగతించారు. సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (CM Omar Abdullah) కూడా కాల్పుల విరమణ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) ఈ విషయంపై ట్వీట్ చేశారు. ఇరుదేశాలతో చర్చలు జరిపిన అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) అఖిలపక్ష సమావేశం, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు.
కాగా.. విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ (Jai Shankar) కాల్పుల విరమణపై ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ లో.. ఉగ్రవాద విషయంలో రాజీలేని వైఖరి కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించామని, సింధూనదీలాల నిలిపివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు. మే12న మరోసారి జరిగే చర్చల తర్వాత మిగతా విషయాలను వెల్లడిస్తామన్నారు.