- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
S-400 : పాకిస్తాన్ క్షిపణులను చిత్తు చేసిన S-400 గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఇవే..!!

దిశ, వెబ్ డెస్క్: S-400: ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్ భారతదేశం పైన ప్రతీకారం తీర్చుకునేందుకు ఇష్టా రీతిన సరిహద్దు గ్రామాల పైన, నివాస ప్రాంతాల పైన దాడులు చేస్తోంది. అయితే ఈ దాడులను భారత సైన్యం తిప్పికొడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ వివిధ రకాల క్షిపణులను, డ్రోన్స్ ను ఉపయోగించి దాడులు చేస్తోంది. అయితే ఈ దాడులను తట్టుకునేందుకు భారత వైమానిక దళం సమర్థవంతంగా యాంటీ మిస్సైల్ టెక్నాలజీని ఉపయోగించి తిప్పి కొడుతోంది.
గాలిలోంచి వస్తున్న మిస్సైల్ ను ముందుగానే గుర్తించి మరో మిసైల్ ను ఉపయోగించడం ద్వారా పాకిస్తాన్ కుటిల ప్రయత్నాలను తిప్పి కొడుతోంది. ఈ ఈ యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం గగనతలంలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో క్షిపణులు ఉన్నప్పుడే ముందుగానే గుర్తించి మరో క్షిపణిని ప్రయోగిస్తుంది. ఈ క్షిపణి నేరుగా వెళ్లి శత్రువులు సంధించిన క్షిపణిపై దాడి చేస్తుంది.
అలా యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం శత్రువుల పాలిట సింహ స్వప్నంలా నిలుస్తుంది. సరిగ్గా అలాంటి యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం ఇప్పుడు భారత్ పాలిట ఉక్కు కవచంలా మారిపోయింది. అదే S-400 యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం. ఇది రష్యా తయారు చేసిన అత్యాధునికమైన వాయుసేన రక్షణ వ్యవస్థ (air defence system).
S-400 డిఫెన్స్ సిస్టం ఒక అత్యాధునికమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనిని చాలా సులువుగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చు. దీనిని ఒక వాహనం పైన అమర్చవచ్చు. ఇది ఒకేసారి మల్టిపుల్ టార్గెట్ పైన దాడి చేస్తుంది. మొత్తం 36 టార్గెట్లను ట్రాక్ చేయగలదు. అలాగే మొత్తం 12 లక్ష్యాలపై రాకెట్స్ లాంచ్ చేస్తుంది. 4 వందల కిలోమీటర్ల దూరం నుంచే శత్రువుల మిస్సైల్స్ గుర్తించి, వాటిపై ఎదురు దాడి చేస్తుంది. అలా గాల్లో ఉన్నప్పుడే శత్రువుల మిస్సైల్ కూల్చేస్తుంది.
ఇది 40N6, 48N6, 9M96E2, 9M96E పేరిట ఉన్న నాలుగు రకాల రాకెట్లు ప్రయోగించగలదు వీటి రేంజ్ సుమారు 40 కి.మీ నుంచి 400 కి.మీ వరకు ఉంటుంది.ఈ రాకెట్ల ద్వారా విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లు ఇలా వేర్వేరు టార్గెట్లను ఒకేసారి టార్గెట్ చేస్తుంది. దీని రియాక్షన్ టైం చాలా వేగంగా ఉంటుంది. S-400 యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టం మిసైల్ ఫైర్ చేయడానికి 5 నిమిషాల్లో సిద్ధమవుతుంది.ఇందులో 3D ఫేజ్డ్ అరే రాడార్ ట్రాకింగ్ ఉంటుంది. ఇది శత్రువులపై ఎదురు దాడి చేయడం ద్వారా వారి ప్రయత్నాలను తిప్పి కొడుతుంది. భారత్ రష్యా నుంచి సుమారు 35,000 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. 5 యూనిట్లు డెలివరీ తీసుకుంది.