Operation Sindoor : స్లీపర్ సెల్స్ యాక్టివేట్! డేంజర్ లో హైదరాబాద్!

by M.Rajitha |
Operation Sindoor : స్లీపర్ సెల్స్ యాక్టివేట్! డేంజర్ లో హైదరాబాద్!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం భారత్–పాకిస్తాన్(India Pakistan War) మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్(High Alert) ప్రకటించబడింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ పోలీసులు(Telangana Police) హైదరాబాద్‌(Hyderabad)లో భద్రతను మరింత పెంచారు. ముఖ్యంగా నగరంలో ఉగ్రవాద సంబంధాలున్న స్లీపర్ సెల్స్(Sleeper Cells) కదలికలపై పోలీసులు గట్టిగా నిఘా పెట్టారు. గతంలో మత కలహాలు, అల్లర్లు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన నిందితులు, పాత నేరస్తులు, జైలులో ఉన్న లేదా ఇటీవల బయటకు వచ్చిన వారిపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు.

ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ , షాడో బృందాలు రంగంలోకి దిగాయి. అనుమానాస్పద వ్యక్తులపై నిత్యం ఓ కన్నేసి సమాచారం సేకరిస్తున్నారు. అంతేగాక, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే పోస్ట్‌లు షేర్ చేస్తే కఠినంగా వ్యవహరించేందుకు ప్రత్యేక బృందాలు వాటిని పర్యవేక్షిస్తున్నాయి. భద్రతా చర్యల్లో భాగంగా నగర సరిహద్దుల్లో తనిఖీలు విస్తృతంగా పెంచారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల వద్ద ప్రయాణికుల లగేజీలు, వాహనాలను పోలీస్‌లు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

అంతేగాక శంషాబాద్ విమానాశ్రయం చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను నిషేధించారు. నగరంలోని సున్నిత ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు, ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో సీసీ కెమెరాల ద్వారా 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రస్తుతం నగర శాంతిని కాపాడుకోవడానికి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించి, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed