భారత్‌లోని 20 నగరాల్లో పాక్ డ్రోన్ దాడులు..తిప్పికొడుతున్న సైన్యం

by Ajay Maddhiboyina |

పాకిస్థాన్ పిరికిపందలా వ్యవహరిస్తూ భారత్‌పై దాడులకు పాల్పడుతుంది. పగలంగా సైలెంట్ గా ఉంటూ చీకటి పడగానే డ్రోన్ దాడులు చేస్తోంది.

భారత్‌లోని 20 నగరాల్లో పాక్ డ్రోన్ దాడులు..తిప్పికొడుతున్న సైన్యం
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ పిరికిపందలా వ్యవహరిస్తూ భారత్‌పై దాడులకు పాల్పడుతుంది. పగలంగా సైలెంట్ గా ఉంటూ చీకటి పడగానే డ్రోన్ దాడులు చేస్తోంది. గురువారం పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్ దాడులు చేయగా వాటిని భారత సైన్యం తిప్పికొట్టింది. కాగా నేడు కూడా పాక్ అదే బుద్ధి చూపిస్తోంది. ఇండియాలోని 20 నగరాలను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతోంది. వందల సంఖ్యల డ్రోన్ లో జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ మరియు గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. ఈ దాడులను భారత సైన్యం సమర్దవంతంగా ఎదురుకుంటుండగా కొన్నిచోట్ల ప్రజలు గాయపడినట్టు తెలుస్తోంది. డ్రోన్ దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో బ్లాక్ విధించి ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

Next Story