ఆప్ శంభు ఆలయంపై పాక్ మిస్సైల్ ఎటాక్.. నిర్వీర్యం చేసిన భారత సేనలు

by Shiva |   ( Updated:2025-05-10 02:47:48.0  )
ఆప్ శంభు ఆలయంపై పాక్ మిస్సైల్ ఎటాక్.. నిర్వీర్యం చేసిన భారత సేనలు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్’‌ను జీర్ణించుకోలేని పాక్ సేనలు భారత నియంత్రణ రేఖ (LOC) వద్ద కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఈ మేరకు సరిహద్దు ప్రాంతాలైన కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. ఈ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. నివాస ప్రాంతాలు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలను లక్ష్యంగా పాక్‌ కాల్పులు జరుపుతోంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జమ్మూ నగరంలోని రూప్‌నగర్ ప్రాంతంలోని సత్రియన్‌లో ఉన్న ప్రముఖ ఆప్ శంభు ఆలయాన్ని పాక్ ఆర్మీ టార్గెట్‌గా చేసుకుని మిస్సెల్ దాడికి పాల్పడింది. అప్రమత్తమైన భద్రతా బలగాలు క్షిపణిని ఆకాశ్ మిస్సైల్‌ టెక్నాలజీతో కూల్చివేయగా అందురూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.



Next Story

Most Viewed