- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మీ లైక్స్, ఫాలోయింగ్ కోసమేనా! పాకిస్తాన్ సెలబ్రెటీలకు న్యూస్ రీడర్ వార్నింగ్!

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతిగా పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పి కొడుతోంది. భారత్ డ్రోన్స్తో పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దాడులపై (Pakistani celebrities) పాకిస్తాన్ సెలబ్రెటీలు స్పందించాలని, మద్దతు ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రముఖ న్యూస్ రీడర్ నదియా ఖాన్ (Nadia Khan) అక్కడి సెలబ్రెటీలకు వార్నింగ్ ఇచ్చారు. ‘మీకు సిగ్గు ఉండాలి. అంతా మీ లైక్స్, ఫాలోయింగ్ కోసమేనా.. ఇప్పుడు దేశానికి మీ అవసరం ఉంది. మా వల్లే మీరు స్టార్స్ అయ్యారు, ఈ సమయంలో ఎక్కడున్నారు’ అని లైవ్లోనే యాంకర్ నిలదీశారు.
మీ జాతి కోసం ఏం చేశారు. ఇండియన్ ఫ్యాన్స్ కోసం నిలబడ్డారు. బోర్డర్ పోయి యుద్ధం చేయండి. సైనికులు మన కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. మిమ్మల్ని మా తలపై పెట్టి చూసుకుంటే.. మీరు నిద్ర పోతున్నారు.. అని యాంకర్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా, జమ్మూలోని పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంలో పాకిస్తానీ సెలబ్రెటీల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, ఓటీటీ ప్లాట్ఫామ్స్, పలు యూట్యూబ్ చానల్స్, భారత్లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.