- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జవాన్ మురళీనాయక్ మృతికి కిషన్ రెడ్డి సంతాపం

దిశ, వెబ్డెస్క్: జవాన్ మురళీనాయక్(Jawan Murali Nayak) మృతికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సంతాపం ప్రకటించారు. మురళీనాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. జవాన్ మురళీనాయక్ది ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా. సరిహద్దులో చొరబాటుదారుల కాల్పుల్లో మురళీనాయక్ ప్రాణాలు విడిచినట్లు అధికారులు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.
మురళీ నాయక్ మృతదేహం రేపు ఉదయం స్వగ్రామానికి చేరుకోనుంది. 2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరారు. రెండు రోజుల క్రితం వరకు నాసిక్లో విధులు నిర్వర్తించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ అధికారులు మురళీ నాయక్ను నాసిక్ నుంచి జమ్మూకశ్మీర్కు పిలిపించారు. శుక్రవారం ఉదయం చొరబాటుదారుల కాల్పుల్లో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయారు. మురళీనాయక్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం సంతాపం ప్రకటించారు.