- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
'పాకిస్తాన్ ప్రజలను చంపడం సిగ్గుచేటు'.. హీరోయిన్ సెన్సేషనల్ పోస్ట్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

దిశ, వెబ్డెస్క్: భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరిట పాక్ ఉగ్రమూకలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. బదులుగా పాకిస్తాన్ నుంచి కూడా ప్రతి దాడులు మొదలయ్యాయి. ఈ క్రమంలో భారత సైన్యానికి మానసిక స్థైర్యం ఇస్తూ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే భారత సైన్యం పాక్కు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మలయాళ నటి అమీనా నిజం షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట సెన్సేషనల్గా మారింది.
తాజాగా అమీనా తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ‘అవును అనేక ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితుల్లో అధ్వానంగా ఉన్నప్పుడు మన దేశం చంపడాన్ని పరిష్కారంగా ఎంచుకుంది. పాకిస్తాన్ ప్రజలను చంపడం సిగ్గుచేటు. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించే వ్యక్తులు ఇప్పుడు తారుమారు అయ్యారు.
మనం చేస్తున్న యుద్ధం వల్ల అక్కడి పౌరులకు మాత్రమే నష్టం వాటిల్లుతుంది. నేను అహం దెబ్బతిన్నప్పుడు మాత్రమే మాట్లాడేదాన్ని కాదు. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే భారతీయురాలిని’ అని అమీనా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇక దీనిని చూసిన వారంతా నటిని దారుణంగా విమర్శిస్తున్నారు. పాకిస్తాన్కు సపోర్ట్ చేయడమేంటని ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు.