India Pakistan ceasefire: పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చిందా.. అందుకే అమెరికాతో మధ్యవర్తత్వం చేయించిందా..?

by Vennela |
India Pakistan ceasefire: పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చిందా.. అందుకే అమెరికాతో మధ్యవర్తత్వం చేయించిందా..?
X

దిశ, వెబ్ డెస్క్: India Pakistan ceasefire: పాకిస్తాన్ భారత్ తో కాళ్లబేరానికి వచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈమేరకు దౌత్య వర్గాల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే పాకిస్తాన్ నిన్నటి వరకు యుద్ధోన్మాదంతో ఊగిపోయింది. కానీ యుద్ధం రంగంలోకి దిగితే గాని పాకిస్థాన్కు తన అసలు సామర్థ్యం అర్థం కాలేదు. ఈ దెబ్బతో భారత్ రెండు రోజులుగా పాకిస్తాన్ దాడులను ఎదుర్కొంటున్న తీరును చూసి పాకిస్తాన్ రక్షణ దళం బెంబేలెత్తిపోయింది. పాకిస్థాన్ ఏకపక్షంగా చేస్తున్న దాడులనే భారత్ ఇంత సమర్థవంతంగా ఎదుర్కొంటే, ఇక ఎదురుదాడికి దిగితే, ఊహకందని విధ్వంసం జరుగుతుందని పాకిస్తాన్ దళాలు భయపడుతున్నాయి. దీంతో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ మాట్లాడుతూ భారత్‌ తమపై చేస్తున్న సైనిక దాడిని ఇక్కడితో ఆపివేస్తే, తాము ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ యుద్ధ పరిస్థితుల వల్ల పాక్ ఆర్థిక పరిస్థితి కుబేర అవడంతో పాటు ప్రజల పరిస్థితులు అద్వానంగా మారే ప్రమాదం ఉందని. ఈ కారణంగానే న్యూఢిల్లీతో చర్చలు జరిపేందుకు ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ ఇరుదేశాలతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం మధ్య, విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం మరోసారి విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ విలేకరుల సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ, భారత్, పాకిస్తాన్ రెండూ కాల్పుల విరమణకు అంగీకరించాయని అన్నారు. ఈ కాల్పుల విరమణ సాయంత్రం ఐదు గంటల నుండి అమల్లోకి వచ్చిందన్నారు. కాల్పులను ఆపడానికి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని విదేశాంగ కార్యదర్శి తెలిపారు. మధ్యాహ్నం 3.35 గంటలకు భారతదేశం మరియు పాకిస్తాన్ DGMO ల మధ్య సంభాషణ జరిగింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల నుండి భూమి, వాయు, సముద్రంపై అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. కాల్పుల విరమణను భారతదేశానికి ఒక పెద్ద దౌత్య విజయంగా భావిస్తున్నారు.

కాల్పుల విరమణపై విలేకరుల సమావేశంలో ఆర్మీ అధికారి రవి నాయర్ మాట్లాడుతూ, 'విదేశాంగ కార్యదర్శి చెప్పినట్లుగా, సముద్రం, వాయు, భూమిపై అన్ని సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి ఒక ఒప్పందం కుదిరింది. భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళం దీనిని అనుసరించాలని ఆదేశిస్తున్నామన్నారు. అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసి, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఒక ట్వీట్ లో అమెరికా మధ్యవర్తిత్వంలో చాలా రాత్రంతా జరిగిన చర్చల తర్వాత, భారతదేశం, పాకిస్తాన్‌లు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను' అని ఆయన అన్నారు.



Next Story

Most Viewed