- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Defence Ministry: లైవ్ కవరేజీ, రియల్ టైమ్ రిపోర్టింగ్ పై ఆంక్షలు

దిశ, నేషనల్ బ్యూరో: రక్షణ కార్యకలాపాలు, భద్రతా కదలికలకు సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ లు ఇవ్వొద్దని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్ వార్తలు, దళాల కదలికల కవరేజీల విషయంలో మీడియా కొంత సంయమనం పాటించాలని ప్రకటనలో సూచించింది. రియల్ టైమ్ రిపోర్టింగ్, లైవ్ కవరేజీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మీడియా ఛానెల్లు, డిజిటల్ ప్లాట్ఫారమ్లను కోరింది. ‘భద్రతా దళాల ఆపరేషన్ల ఫలితాలను ప్రభావితం చేసే సమాచారాన్ని వెల్లడిస్తే.. వారి ప్రాణాలకు ముప్పు కూడా రావచ్చు. గతంలో కూడా కార్గిల్ యుద్ధం, 26/11 దాడులు, కాందహార్ హైజాక్ ఘటనల్లో రిపోర్టింగ్ అంశాలను గుర్తుచేసింది. కేబుల్ టెలివిజన్ చట్టం ప్రకారం.. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల సమయంలో కేవలం అర్హత ఉన్న అధికారి సమయానుసారం బ్రీఫింగ్స్ ఇచ్చేందుకు అర్హులు. ఈ క్రమంలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించి.. సున్నితంగా, బాధ్యతాయుతంగా కవర్ చేయాలి’’ అని పేర్కొంది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా జాతీయ భద్రత పట్ల శ్రద్ధ వహించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తప్పుడు వార్తలు..
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) వేళ తప్పుడు వార్తలు ప్రచారంలోకి రాకుండా చర్యలు తీసుకొంటోంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్లు నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా, గురువారం పాకిస్థాన్ భారత్ పై డ్రోన్లతో దాడులకు పాల్పడింది. పాక్ ప్రయత్నాలను భారత్ దెబ్బతీసింది. డ్రోన్ దాడి విఫలమైన తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో దేశ ప్రస్తుత భద్రతా పరిస్థితిని సమీక్షించారు.