- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సరిహద్దుల్లో కాల్పులు.. బీఎస్ఎఫ్ ఎస్సై వీరమరణం

దిశ, వెబ్డెస్క్: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్సై ఎండీ ఇంతియాజ్ వీరమరణం చెందారు. శనివారం జమ్మూలోని ఆర్ఎస్ పురా బీఎస్ఎఫ్ ఔట్ పోస్టుకు నేతృత్వం వహిస్తున్న సమయంలో పాక్ కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో గాయపడిన ఇంతియాజ్ మరణించినట్లు బీఎస్ఎఫ్ డీజీ వెల్లడించారు. ఇంతియాజ్ మరణం పట్ల అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం జమ్మూలోని బీఎస్ఎఫ్ కార్యాలయంలో నివాళులు అర్పించనున్నారు. కాగా.. పాక్ కాల్పుల్లో మరికొందరు బీఎస్ఎఫ్ జవాన్లకు గాయలవ్వగా వారంతా చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
ఇరు దేశాల మధ్య అమెరికా దౌత్యంతో కాల్పుల విరమణ జరిగిన నాలుగు గంటల్లోనే పాక్ సైన్యం ఆ నిబంధనలను తుంగలో తొక్కి కాల్పులకు పాల్పడింది. డ్రోన్లు, ఆర్టిలరీ గన్స్ తో జమ్మూ, శ్రీనగర్ సహా ఎల్ఓసీ అంతటా కాల్పులకు పాల్పడింది. దీంతో జమ్మూ కశ్మీర్, జలంధర్, జై సల్మేర్, కథువా, సరిహద్దు నగరాలన్నీ బ్లాక్ అవుట్ లోకి వెళ్లిపోయాయి. భారత ఆర్మీ శ్రీనగర్ లో కాల్పులను తిప్పికొట్టింది. ప్రస్తుతం ప్రధాని నివాసంలో హైలెవల్ మీటింగ్ జరుగుతుండగా.. వారి దృష్టికి అధికారులు కాల్పుల విరమణ ఘటనను తీసుకెళ్లగా.. పాక్ కాల్పుల్ని తిప్పికొట్టాలని కేంద్రం బీఎస్ఎఫ్ సిబ్బందికి ఫుల్ పవర్స్ ఇచ్చింది.