Operation Sindoor : జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న బ్లాక్ ఔట్

by M.Rajitha |
Operation Sindoor : జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న బ్లాక్ ఔట్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్-పాకిస్తాన్(India Pakisthan War) మధ్య కాల్పుల విరమణ ఉల్లంఘనలతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా ఉన్నాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు సీజ్‌ఫైర్ ఒప్పందం(Ceasefire Deal) జరిగిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్... జమ్మూకశ్మీర్లోని రాజౌరి, పూంఛ్, సుందర్‌బనీ, నౌషేరా, శ్రీనగర్, జమ్మూ, ఉధంపూర్‌లో షెల్లింగ్, డ్రోన్ దాడులతో కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. అయితే ఈ దాడులకు భారత సైన్యం S-400, బరాక్ 8 వ్యవస్థలతో గట్టిగా స్పందించి డ్రోన్‌లను నాశనం చేసింది.

శనివారం రాత్రి 7:45 గంటల నుంచి శ్రీనగర్, బారాముల్లా, కఠువా, నాగ్రోటాలో భారీ పేలుళ్లు జరిగినట్టు తెలుస్తోంది. రాజౌరిలో జరిగిన ఒక పేలుడులో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ థాపా మరణించారు. సివిలియన్ గ్రామాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. శ్రీనగర్, జమ్మూ, కఠువా, రాజౌరిలో బ్లాక్‌ఔట్‌లు కొనసాగుతున్నాయి. విమానాశ్రయాలు మే 15 వరకు మూతపడగా.. 430కి పైగా విమానాలు రద్దయ్యాయి. స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. నాగ్రోటా మిలిటరీ స్టేషన్ సమీపంలో అనుమానాస్పద కదలికలపై సెంట్రీ కాల్పులు జరిపింది.

ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతుండగా.. ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మరోవైపు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాక్ సీజ్ ఫైర్ ఉల్లంఘనలను ఖండిస్తూ.. దాడులపై చూస్తూ ఊరుకోవద్దని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇరు దేశాల మధ్య మే 12న దౌత్య చర్చలు జరగనున్నాయి.



Next Story

Most Viewed