- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాక్కు మరో షాక్...బలుచిస్థాన్లో తమ జెండాలు ఎగరవేస్తున్న బీఎల్ఏ

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య వార్ జరుగుతుంటే బలుచిస్థాన్ కూడా దాయాది దేశానికి పక్కలో బల్లెంలా మారింది. పాక్ ను బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ అదునుచూసి దెబ్బకొడుతోంది. ఇండియా పాకిస్థాన్ మధ్య దాడుల నేపథ్యంలో పాక్ తన ఆర్మీని ఇండియా సరిహద్దుల్లో మోహరించింది. దీంతో బలూచిస్థాన్ లో పాక్ సైనికుల సంఖ్య తగ్గిపోయింది. ఛాన్స్ దొరకడంతో బీఎల్ ఏ బలుచిస్థాన్లోని పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తూ వారిని మట్టుపెడుతోంది.
అంతే కాకుండా ఆర్మీ స్థావరాలపై ప్రధాన కార్యాలయాలపై ఉన్న పాక్ జెండాలను తొలగించి బలుచిస్థాన్ జెండాలను ఎగరవేస్తోంది. ఇప్పటికే ఫైజాబాద్, ఇస్లామాద్ లోనూ బలుచిస్థాన్ ఆర్మీ పాక్ ఆర్మీపై బాంబు దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్ ఆర్మీలో కొందరు సైనికులు కూడా చనిపోయారు. పరిస్థితి ఇలానే కొనసాగితే బలూచిస్థాన్ స్వాతంత్ర దేశంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే 1948కి ముందు బలూచిస్థాన్ స్వతంత్య్ర దేశం కాగా పాకిస్థాన్ దాడి చేసి ఆక్రమించుకుంది. బలూచిస్థాన్లో ఖనిజ నిక్షేపాలు ఉండటంతో పాక్ ఆదాయ వనరుగా మారింది. కానీ అక్కడి ప్రజల హక్కులను పాక్ కాలరాయడంతో తిరుగుబాటు మొదలైంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ నుండి బలూచిస్థాన్ స్వతంత్య్రం కోరుకుంటోంది.