- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
india pak war: ఆ సమాచారం కోసమే భారత్ పై పాక్ డ్రోన్ల దాడి?

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ - పాకిస్తాన్ (India-Pak) సరిహద్దుల్లో యుద్ధవాతావరణం టెన్షన్ పెట్టిస్తోంది. పాక్ కవ్వింపు చర్యలకు భారత్ దీటుగా బదులిస్తోంది. ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టిన తర్వాత పాకిస్తాన్ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తోంది. భారత సైన్యాన్ని నేరుగా ఎదుర్కొలేమని గ్రహించిన పాక్ ఇక్కడే తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంటూ వస్తోంది. ఇప్పటికే వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న పాక్.. భారత్ పైకి ఏకంగా 400 డ్రోన్లతో దాడులకు తెగబడటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంత మొత్తంలో డ్రోన్ల (Pakistan Drones) వినియోగం వెనుక పాక్ కుయుక్తి కోణం దాగి ఉందనే చర్చ తెరపైకి వస్తోంది.
ఆ వివరాల కోసమే డ్రోన్ దాడులు?:
డ్రోన్ దాడుల వెనుక సంచలన విషయాలు ఉన్నాయనే వాదన తెరపైకి వస్తోంది. ఇటీవల భారత్ లోని 36 లొకేషన్లను టార్గెట్ చేస్తూ డ్రోన్స్ ప్రయోగించినట్లు ఇటీవల సోఫియా ఖురేషీ వెల్లడించారు. అయితే పాక్ ప్రయోగించిన డ్రోన్స్ తుర్కిష్ (టర్నీ) కు చెందినవిగా తమ ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడించింది. అయితే ఈ డ్రోన్స్ ప్రయోగించడం వెనుక పాక్ కేవలం గగనతలం చొరబాటు మాత్రమే కాదని ఇది మన రక్షణ వ్యవస్థలను (Indian Defense System) ఒత్తిడికి గురిచేసే ప్రణాళిక కూడా కావొచ్చు అని పలువురు డిఫెన్స్ ఎక్స్ ఫర్ట్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా ప్రత్యక్షంగా భారత్ కు నష్టం కలిగించడం కంటే భారత వైమానిక రక్షణ వనరులను ఖాళీ చేయడం, భారత రాడార్ వ్యవస్థ కవరేజ్ పనితీరు, సైన్యం నుంచి వచ్చే ప్రతిస్పందనలు తెలుసుకునేందుకు బహుముఖ వ్యూహంలో భాగంగా ఈ డ్రోన్ దాడులకు పాక్ తెగబడుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తులో ఉధృత పరిస్థితులు తలెత్తితే భారత వాయుదళం ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయంలో ముఖ్యమైన సమాచారం తెలుసుకోవడంలో ఒక వ్యూహం అయి కూడా ఉండవచ్చనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఈ హైబ్రిడ్ దాడుల్లో పాక్ చివరకు ఎలాంటి పరిస్థితులను కొని తెచ్చుకుంటుందో అనేది వేచి చూడాలి.