BJP మూడో జాబితా విడుదల.. తమిళిసై పోటీచేసే సెగ్మెంట్ ఖరారు

by Disha Web Desk 2 |
BJP మూడో జాబితా విడుదల.. తమిళిసై పోటీచేసే సెగ్మెంట్ ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. గురువారం తొమ్మిది మందితో కూడిన జాబితాను అధికారికంగా ప్రకటించింది. ఇందులో ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా రాజీనామా చేసిన గవర్నర్ తమిళిసైకి అవకాశం కల్పించారు. తమిళనాడులోని చెన్నై సౌత్ నుంచి తమిళి సై పోటీ చేయనుందని ప్రకటించారు. నీలగిరి నుంచి మురుగన్, కన్యాకుమారి నుంచి రాధాకృష్ణన్, కోయంబత్తూ్ర్ నుంచిత తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పోటీ చేయబోతున్నారు. కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను క్రమంగా ప్రకటిస్తోంది. మొదటి జాబితాలో 195 మందితో విడుదల చేయగా.. రెండో జాబితాలో మరో 72 మందిని అనౌన్స్ చేసింది. ఇక తాజాగా మూడో జాబితాలో 9 మందిని ప్రకటించింది.

Next Story

Most Viewed