బీఆర్ఎస్‌కు సీతారాం నాయక్ గుడ్ బై.. బీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్‌కు సీతారాం నాయక్ గుడ్ బై.. బీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ స్పందించారు. శనివారం ఉదయం ఓ మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో తనకు గుర్తింపు దక్కలేదని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా అని భావోద్వేగానికి గురయ్యారు. ఐదేళ్ల పాటు రాజకీయంగా నన్ను అడ్డుకున్నారని కీలక ఆరోపణలు చేశారు. ప్రస్తుతం నన్ను ఒక జాతీయ పార్టీ గుర్తించిందని అన్నారు. కిషన్ రెడ్డి తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. రామప్పకు జాతీయ హోదా తీసుకొచ్చినందుకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.

‘ఇక నేను నిర్ణయం తీసుకున్నాను. నన్ను గుర్తించే పార్టీలోనే చేరుతా’ అని ప్రకటించారు. మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా మనసులో మాట బయటపెట్టారు. కాగా, శుక్రవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో ఆయన హన్మకొండలోని సీతారాం నాయక్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. అనుచరులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని సీతారాం నాయక్ చెప్పారు. సీతారం నాయక్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును కూడా బీజేపీ నాయకులు కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం.


Next Story

Most Viewed