సోనియా గాంధీ పోటీ చేయకపోవడంపై ప్రధాని మోడీ సెటైర్

by Disha Web Desk 2 |
సోనియా గాంధీ పోటీ చేయకపోవడంపై ప్రధాని మోడీ సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఓటమి భయంతోనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయడం లేదని సెటైర్ వేశారు. రాజస్థాన్‌లోని జాలోర్‌లో ఆదివారం ప్రధాని పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు అయ్యారని విమర్శించారు. రాజ్యసభకు వెళ్లేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు రాజస్థాన్‌‌‌ను అడ్డాగా మార్చుకున్నారని అన్నారు.

గతంలో కేసీ వేణుగోపాల్, ఆ తర్వాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇప్పుడు సోనియాగాంధీ కూడా రాజస్థాన్‌ను రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ 60 ఏళ్లు అధికారంలో ఉందని గుర్తుచేశారు. ఒకప్పుడు ఆ పార్టీ 400 స్థానాలు గెలుచుకుందని, ఇప్పుడు మాత్రం అభ్యర్థుల్నే నిలబెట్టలేకపోతోందని ఎద్దేవా చేశారు. 400 మార్కుని ఈసారి ఎన్డీఏ అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, దేశ వ్యాప్తంగా 400 సీట్లే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది.



Next Story

Most Viewed