- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
MIM ఉన్న ప్రాంతాల్లో 80 శాతం ఓటింగ్ ఎలా సాధ్యం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: ఎమ్ఐఎమ్ పార్టీపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్ఐఎమ్ పార్టీ పోటీలో ఉన్న ప్రాంతాల్లో 80 శాతం ఓటింగ్ నమోదు అవుతుందని.. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కచ్చితంగా బూత్లతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం ట్రిపుల్ తలాక్పై స్పందించారు. ముస్లిం దేశాల్లో కూడా ట్రిపుల్ తలాక్ లేదని అన్నారు.
ఈ విధానాన్ని మోడీ రద్దు చేశారని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా చట్టాలను రూపొందించామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్న 6 గ్యారెంటీల్లో అన్నింటిని ఇంకా ఎందుకు అమల్లోకి తీసుకురావట్లేదని ప్రశ్నించారు. ఏం సాధించారని, ఏం మొహం పెట్టుకొని తుక్కుగుడలో మీటింగ్ పెట్టుకుంటున్నారని నిలదీశారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీలు అమలు చేస్తామని చెబుతున్నారన్నారు. పరోక్షంగా గ్యారంటీలు అమలు చేయమని సీఎం రేవంత్రెడ్డి చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోబోతోందని కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.