కొడంగల్ నా గుండె చప్పుడు.. CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
కొడంగల్ నా గుండె చప్పుడు.. CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొడంగల్ నియోజకవర్గ ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన కొడంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని 58 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ‘నేను ఎక్కడున్నా.. నా గుండెచప్పుడు కొడంగల్’ అని అన్నారు. కాంగ్రెస్‌లో డీకే అరుణ మంత్రి పదవి అనుభవించారని తెలిపారు. ఇప్పుడు బీజేపీలోనూ కీలక పదవిలో ఉన్న ఆమె.. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తేలేదని ప్రశ్నించారు.

డీకే అరుణ వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదని అన్నారు. కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్‌లో రూ.4 వేల కోట్లతో నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. కాంగ్రెస్‌ను ఓడగొట్టాలని మాట్లాడుతున్నారు.. సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకు ఓడించాలా? అని అడిగారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. కొడంగల్‌లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా నిర్మించలేదని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు.



Next Story

Most Viewed