ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి మంత్రి పదవి పోవడం ఖాయం: BRS నేత

by Disha Web Desk 2 |
ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి మంత్రి పదవి పోవడం ఖాయం: BRS నేత
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ కీలక ఆరోపణలు చేశారు. బుధవారం తెంలగాణ భవన్‌లో గెల్లు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవి పోవడం ఖాయమని అన్నారు. మంత్రి పదవి కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి సోదరులకు క్రెడిబిలిటీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆశీర్వాదం కోసం తాపత్రయ పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గురుకుల పాఠశాలల పట్ల వివక్ష చూపుతున్నారని అన్నారు.

దీంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యా శాఖపై ఒక్క సమీక్ష కూడా చేయలేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే విద్యార్థుల బలిదానాలు ఎక్కువగా జరిగాయని గుర్తుచేశారు. సంక్షేమ శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర వున్నాయని విమర్శించారు. గురుకుల పాఠశాలల్లో నాసిరకం భోజనాలు పెడుతున్నారని మండిపడ్డారు. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో భారీగా ఫీజులు పెంచి పేదల రక్తం తాగుతున్నారని అన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని.. కేసీఆర్ గురించి మాట్లాడిన వాళ్లంతా కనుమరుగు అయ్యారని చెప్పారు.


Next Story

Most Viewed