రాజస్థాన్ త్రిల్లింగ్ విక్టరి.. ఐపీఎల్ నుంచి పంజాబ్ అవుట్..

by Disha Web Desk 12 |
రాజస్థాన్ త్రిల్లింగ్ విక్టరి.. ఐపీఎల్ నుంచి పంజాబ్ అవుట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 లో బాగంగా 66వ మ్యాచ్ పంజాబ్, రాజస్థాన్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించి.. విజయాన్ని అందుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్ పడిక్కల్ 30 బంతుల్లో.. 3 సిక్సర్లు, 5 ఫోర్లతో 51 పరుగులు చేయగా.. అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది.


Next Story

Most Viewed