ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం..

by Disha Web Desk 12 |
ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 17వ మ్యాచ్ CSK, RR మధ్య చిదంబరం వేదికగా జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. మొదట టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. బట్లర్ 52, పడిక్కల్ 38, అశ్విన్ 30, హెట్ మేయర్ 30 పరుగులతో రాణించడంతో RR జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన చెన్నై మూడో ఓవర్లోనే గైక్వాడ్ వికెట్ కోల్పోయింది.

కాన్వే, రహానే, ధోని, జడేజా రాణించినప్పటికి చివరి ఓవర్లో 21 పరుగుల చేయాల్సిన సందర్బంలో ధోని రెండు సిక్సర్లు కొట్టడంతో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ సీనియర్, స్లాగ్ ఓవర్స్ స్పెసలిస్ట్‌గా పేరుగాంచిన సందీప్ శర్మ కూల్ గా యార్కర్లు వేసి రాజస్థాన్ జట్టుకు మూడు పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు. ఈ విజయంతో RR జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్‌కు చేరుకుంది.

Next Story

Most Viewed