ఈ మ్యాచ్ ఓడితే ఆ జట్టు ఇంటికే

by Disha Web Desk 12 |
ఈ మ్యాచ్ ఓడితే ఆ జట్టు ఇంటికే
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో అన్ని జట్లు దాదాపుగా పది మ్యాచులు పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలో వరుస ఓటమిల తర్వాత రెండు విజయాలు అందుకున్న KKR జట్టు ఈ రోజు పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడితే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయిన మొట్టమొదటి జట్టు గా నిలవనుంది. ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడిన కోల్‌కత్తా.. కేవలం నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. దీంతో KKR ప్లేఆఫ్ రేసులో కొనసాగాలంటే.. ఈ సీజన్ లో మిగిలి ఉన్న నాలుగు మ్యాచుల్లో గెలవాలి. అలాగే.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంజాబ్, బెంగళూరు జట్లపై విజయం సాధిస్తేనే KKR ప్లే ఆఫ్‌కు వెళ్లు చాన్స్ ఉంది. ఈ క్రమంలో పంజాబ్‌తో జరగనున్న ఈ మ్యాచ్ తీవ్ర ఆసక్తిగా మారనుంది. కాగా ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలి అంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే..

Next Story

Most Viewed