IPL 2023 Final: ఐపీఎల్ చెన్నై గెలిచినా.. ఆ విషయంలో చాలా బాధగా ఉంది : సునీల్ గవాస్కర్

by Disha Web Desk 13 |
IPL 2023 Final: ఐపీఎల్ చెన్నై గెలిచినా.. ఆ విషయంలో చాలా బాధగా ఉంది : సునీల్ గవాస్కర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎంఎస్ ధోనీ ఐపీఎల్ ఫైనల్‌లో ఒక్క పరుగు కూడా చేయలేక తొలి బంతికే అవుటయ్యాడు. దీనిపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు. ధోనీ కనుక మంచి ఇన్నింగ్స్ ఆడి ఉంటే అది ఇంకా బాగుండేదని అభిప్రాయపడ్డాడు. "ఈ మ్యాచ్‌లో విన్నింగ్ రన్స్ కనుక ధోనీ చేసి ఉంటే.. అది ఇంకా బాగుండేది. అయితే అతను టీం ప్లేయర్ కనుక బాగానే సంతోషిస్తాడు. అతను తొలి బంతికే ఈ మ్యాచ్‌లో అవుటయ్యాడు. కానీ మనం గెలవడమే ముఖ్యం కదా. మనం సెంచరీ చేసినా, ఐదు వికెట్లు తీసుకున్నా టీం ఓడిపోతే వేస్ట్. కానీ మనం సున్నా పరుగులకే అవుటైనా లేదంటే 40-50 పరుగులు చేసి, టీం గెలిస్తే అది చాలా గొప్ప" అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. చెన్నై జట్టు కప్పు గెలిచినందుకు తనకు సంతోషంగానే ఉందని.. కానీ ఈ ఒక విషయం మాత్రం చాలా బాధగా ఉందని సునీల్ గవాస్కర్ తెలిపాడు.


Next Story

Most Viewed