రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్.. భారత జట్టు దాదాపు ఖరారు!

by Disha Web Desk 2 |
రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్.. భారత జట్టు దాదాపు ఖరారు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్2024) సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అన్ని జట్లు అంచనాలకు మించి అదరగొడుతున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు దాదాపు ఐదారు మ్యాచులు సైతం ఆడేశాయి. ఐపీఎల్ అనంతరం టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఎలాగైనా ఆడాలని.. దేశ జట్టులో చోటు దక్కించుకోవాలని విదేశీ ఆటగాళ్లు అనేకమంది ఐపీఎల్‌ను సైతం వదులుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బీసీసీఐ టోర్నమెంట్‌కు జట్టు ఎంపికపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తుది జట్టులో 15 మంది స్క్వాడ్, 5 మంది స్టాండ్ బై ప్లేయర్లు ఉండనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన జట్టును ఇప్పటికే బీసీసీఐ సెలక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

జట్టు(అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రింకూ సింగ్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బూమ్ర, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్.



Next Story

Most Viewed