శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర విషాదం.. ఇద్దరు ప్రయాణికులు మృతి

by Gantepaka Srikanth |

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌(Shamshabad)లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Rajiv Gandhi International Airport)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర విషాదం.. ఇద్దరు ప్రయాణికులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌(Shamshabad)లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Rajiv Gandhi International Airport)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అస్వస్థతతో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం గోవా(Goa) నుంచి వచ్చిన నితిన్ షా(Nitin Shah) అనే వ్యక్తి, జెడ్డా నుంచి వచ్చిన షేక్ సకీనా అనే మహిళ ఎయిర్‌పోర్టులోకి ఎంటర్ అవగానే కుప్పకూలారు. గమనించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది హుటాహుటిన వారిని అపోలోకి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story