ఇంటి ముందు ముగ్గు వేస్తున్న వారిపైకి దూసుకొచ్చిన లారీ.. యువతి దుర్మరణం

by Disha Web Desk 2 |
ఇంటి ముందు ముగ్గు వేస్తున్న వారిపైకి దూసుకొచ్చిన లారీ.. యువతి దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా మండపల్లి మండలం కానుకొల్లులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం భోగి పండుగ సందర్భంగా ఇంటి ఎదుట ముగ్గులు వేస్తున్న మహిళలు, యువతులపై సడన్‌గా ఓ లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని(17) అనే యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో యువతి పల్లవి దుర్గ(18)కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరార్ కాగా.. మరొకరిని పట్టుకొని గ్రామస్తులు చితకబాదారు. అనంతరం పోలీసులకు పట్టించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.


Next Story

Most Viewed