తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణం

by GSrikanth |

అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గాలివీడు మండలం చిలకలూరిపేటలో ముగ్గురు పిల్లలతో కలిసి గండిమడుగులో దూకి తల్లి బలవన్మరణానికి పాల్పడింది.

తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గాలివీడు మండలం చిలకలూరిపేటలో ముగ్గురు పిల్లలతో కలిసి గండిమడుగులో దూకి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి.. రక్షించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే వారంతా మృతిచెందారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు నాగమణి, నవ్యశ్రీ, దినేష్, జాహ్నవిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story