గుజరాత్‌ నుంచి తరలింపు.. సరిహద్దులో భారీగా బంగారం సీజ్

by Disha Web Desk 2 |
గుజరాత్‌ నుంచి తరలింపు.. సరిహద్దులో భారీగా బంగారం సీజ్
X

దిశ, జహీరాబాద్: అక్రమంగా గుజరాత్ నుండి హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ.4.55 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. చిరగపల్లి ఎస్ఐ నరేష్ వివరాల ప్రకారం.. తెలంగాణ - కర్ణాటక సరిహద్దులోని మాడిగి క్రాస్ వద్ద పోలీసులు అంతర్రాష్ట్ర చెక్‌‌పోస్టు ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి జహీరాబాద్ వైపు వస్తున్న ఓ స్కార్పియో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఎలాంటి పత్రాలు లేని రూ.4.55 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.


Next Story

Most Viewed