నానమ్మ చంపి ఇంట్లో పూడ్చిపెట్టిన మనవడు

by Disha Web Desk 2 |
నానమ్మ చంపి ఇంట్లో పూడ్చిపెట్టిన మనవడు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సొంత నానమ్మను మనవడు కిరాతకంగా కొట్టి చంపాడు. ఈ ఘటన జిల్లాలోని గోనెగండ్ల మండలం పెద్దమరవీడులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బంగారం కోసమే మనవడు వెంకటేశ్ నాన్నమ్మకు చంపినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యా్ప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story