BREAKING : శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో రూ.6 కోట్ల విలువ చేసే వజ్రాలు, విదేశీ కరెన్సీ సీజ్

by Disha Web Desk 1 |
BREAKING : శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో రూ.6 కోట్ల విలువ చేసే వజ్రాలు, విదేశీ కరెన్సీ సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.6 కోట్ల విలువ చేసే వజ్రాలు, విదేశీ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుబాయ్‌ వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఇవాళ సాయంత్రం. వారి కదిలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని లగేజీని పూర్తిగా తనిఖీ చేయగా, చాక్లెట్‌ పేపర్లలో చుట్టి ఉన్న ఓ ప్యాకెట్‌లో రూ.6 కోట్ల విలువైన వజ్రాలు, రూ.9.83 లక్షల విదేశీ కరెన్సీ, రూ.లక్ష నగదు కనొగొన్నారు. అయితే, వాటికి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో ఆ ప్రయాణికులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



Next Story

Most Viewed