BREAKING: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

by Disha Web Desk 1 |
BREAKING: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా ఏటుకూరు జాతీయ రహదిరపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంకర లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి అతివేగంతో వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉంది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed