BREAKING: రాచకొండలో పోలీసుల తనిఖీలు.. భారీగా ఎత్తున డ్రగ్స్ స్వాధీనం

by Disha Web Desk 1 |
BREAKING: రాచకొండలో పోలీసుల తనిఖీలు.. భారీగా ఎత్తున డ్రగ్స్ స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితులు ఎవరైనా మాదక ద్రవ్యాలతో పట్టుబడితే కఠినంగా శిక్షించాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేపడుతూ.. పెద్ద ఎత్తున గంజాయి, డ్రగ్స్ రవాణా అడ్డుకట్ట వేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇవాళ రాచకొండలో పోలీసుల విస్తృతంగా తనిఖీలు చేపడుతుండగా భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రాజస్థాన్‌ నుంచి డ్రగ్స్ అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. అనంతరం పోలీసులు ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 10 గ్రాముల ఎండీఎంఏ, 500 గ్రాముల ఓపీఎంను సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. అయితే, పట్టుబడిన నిందితులపై గతంలోనూ కేసులు నమోదయ్యాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.


Next Story

Most Viewed