BREAKING: నిజామాబాద్ పట్టణంలో దారుణం.. కత్తులతో యువకుల ఘర్షణ

by Disha Web Desk 1 |
BREAKING: నిజామాబాద్ పట్టణంలో దారుణం.. కత్తులతో యువకుల ఘర్షణ
X

దిశ, వెబ్‌డెస్క్: కత్తులతో యువకులు పరస్పరం దాడి చేసుకున్న ఘటన నిజామాబాద్ పట్టణంలోని అర్సపల్లి చౌరస్తాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫిరోజ్ ఖాన్, అక్రమ్ అనే ఇద్దరు యువకులు గంజాయి మత్తులో పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో అక్రమ్, ఫిరోజ్ ఖాన్ గొంతు భాగంలో పొడిచాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన ఫిరోజ్‌ ఖాన్‌ను చికిత్స నిమిత్తం సమీప అసుపత్రికి తరలించారు. ఈ మేరకు అక్రమ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed