- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు తెలియని శవం లభ్యం
by Sridhar Babu |
మహమ్మద్ నగర్ మండలంలోని మగ్దూంపూర్ గ్రామ శివారులో గల డిస్ట్రిబ్యూటర్ 7 ప్రధాన కాలువలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైనట్లు ఎస్ఐ కె.సుధాకర్ తెలిపారు.

X
దిశ,నిజాంసాగర్ : మహమ్మద్ నగర్ మండలంలోని మగ్దూంపూర్ గ్రామ శివారులో గల డిస్ట్రిబ్యూటర్ 7 ప్రధాన కాలువలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైనట్లు ఎస్ఐ కె.సుధాకర్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని మగ్గంపూర్ గ్రామ శివారులో గురువారం ప్రధాన కాలువలో మహిళ మృత దేహం లభ్యమైందని తెలిపారు. వయస్సు 50 నుండి 55 సంవత్సరాలు ఉంటుందని, నీలి రంగు చీర, పసుపు రంగు జాకెట్, మెరూన్ రంగు లంగా ధరించి ఉందని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన మహిళ వివరాలు ఎవరికైనా తెలిస్తే నిజాంసాగర్ ఎస్ఐ సుధాకర్ సెల్: 8712686172, బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ సెల్: 8712686170 నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
Next Story






