ఎనిమిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

by Dishafeatures2 |
ఎనిమిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో/చార్మినార్​: తన వికృత వాంఛలకు ఎనిమిదేళ్ల చిన్నారిని బలి చేశాడు ఓ కామాంధుడు. గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆ మానవ మృగం బాధితురాలికి వరుసకు మేనమామ కావటం. వివరాలు ఇలా ఉన్నాయి. మొఘల్​పురా ప్రాంతంలో నివాసముంటున్న ఓ మహిళకు ఎనిమిదేళ్ల కూతురు ఉంది. ఆ చిన్నారికి వరుసకు మేనమామ అయ్యే విజయ్​ కుమార్​ ఎలియాస్​ మున్నా (23) కూడా అదే ప్రాంతంలో ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆ చిన్నారిపై కన్నేసిన విజయ్​ కుమార్ తరచూ బాలికను తన ఇంటికి తీసుకెళ్లేవాడు. ఆ తరువాత అసహజ పద్దతుల్లో ఆ చిన్నారిపై అఘాయిత్యం జరుపుతూ వస్తున్నాడు. కొన్నిసార్లు మద్యం తాగిపించి తన పశు వాంఛలు తీర్చుకునేవాడు.

విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దాంతో ఆ బాలిక ఎవ్వరికీ విషయాన్ని చెప్పలేదు. కాగా, రెండు రోజుల క్రితం ఆ చిన్నారి మత్తులో ఉండటాన్ని గమనించిన తల్లి ఏం జరిగిందని ప్రశ్నించింది. అప్పటికీ బాధితురాలు ఏమీ చెప్పలేదు. దాంతో తల్లి గాలి ఊదమని చెప్పగా ఊదింది. అప్పుడు బాలిక మద్యం సేవించి ఉన్నట్టు వెల్లడైంది. దాంతో తల్లి గట్టిగా ప్రశ్నించటంతో విజయ్​ కుమార్​ తనపై చేస్తూ వస్తున్న అఘాయిత్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ మేరకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయగా మొఘల్​పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed